బాబ్రీ తీర్పుపై అప్పీలుకు ముస్లిం సంఘాల నిర్ణయం-త్వరలో హైకోర్టులో పిటిషన్
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాస్తవాలను విస్మరించేలా ఉందని ఆరోపిస్తున్న ముస్లిం సంఘాలు దీనిపై తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.
బాబ్రీ మసీదు కూల్చివేత..కేసు కొట్టివేత: ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు? హిందుత్వ జాగృతం
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, జోషీ, ఉమాభారతి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ తీర్పులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. తీర్పుపై స్పందించిన ముస్లిం పర్సనల్ లాబోర్డుతో పాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కూడా ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించాయి. దీంతో ఈ వ్యవహారం తిరిగి అలహాబాద్ హైకోర్టుకు చేరబోతోంది.
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులు ఉన్నాయని, వీటిని హైకోర్టులో సవాలు చేస్తామని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ ప్రకటించారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లిం పర్సనల్ లాబోర్డు తరఫున హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్లో భాగస్వామి అవుతానని ఇప్పటికే ప్రకటించారు.