రామాయణ పరీక్షలో టాపర్గా నిలిచిన ముస్లీం బాలిక
బెంగళూరు: కర్నాటకలోని దక్షిణ కన్నడ పుత్తూరుకు చెందిన ముస్లీం బాలిక పాతిమాత్ రాహిలా అనే బాలిక రామాయణం పరీక్షలో టాపర్గా నిలిచింది. బడగన్నూరు గ్రామంలోని సుళ్య సర్వోదయ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాతిమాత్ భారత సంస్కృతి ప్రతిష్టాన నిర్వహించిన రామాయణం పరీక్షలు రాసింది.
35 మందిలో ఆమె 93 మార్కులతో టాపర్గా నిలిచింది. ఆమె తండ్రి ఇబ్రహీం ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పాతిమాత్కు అత్యధిక మార్కులు రావడంపై తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. తమ పాఠశాల విద్యార్థికి ఎక్కువ మార్కులు రావడం ఆనందం కలిగిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాం వెల్లడించారు.
ఈ పరీక్ష 2015 నవంబర్ నెలలో భారత్ సంస్కృత్ ప్రతిష్టాన నిర్వహించింది. ఫాతిమత్ కర్నాటక - కేరళ సరిహద్దులోని సల్లియాపడవులో గల సర్వోదయ హైస్కూల్లో చదువుతోంది. బాలికను ఆమె మామయ్య సపోర్ట్ బాగా ఉందని చెబుతున్నారు.