ముస్లింలు 50 మంది భార్యలను, 1050 మంది పిల్లలను కంటారు...! బీజేపీ ఎమ్మెల్యే
యూపీ వివాద్పద ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో పాలు సార్లు వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ముస్లింల సంతానం పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమ మతానికి విరుద్దంగా ఒక్కోక్కరు 50 పెళ్లిళ్లు చేసుకుని 1000 మంది పిల్లల్లి కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీని ఇరుకున పెట్టాయి.
ముస్లింలు జంతువుల్లా వ్యవహరిస్తున్నారు.
ముస్లింలు కుటుంభాల్లో ఒక్కక్కరికి 50 మంది భార్యలు ఉంటారు..వారు వెయ్యికిపైగా పిల్లల్ని కంటారు. ఇది వారి సంప్రాదాయం కాకపోయినప్పటికి ఇలా జంతువుల్లా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. సాధరణ కుటుంభాల్లో ముగ్గరు లేదా నలుగురు ఉంటారు కాని ముస్లింలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీపై సెటైర్లు...
కాగా సురేంద్రసింగ్ ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు ఆయన గతంలో కూడ హిందువులు తమ జనాభాను పెంపోందించుకోవడం కోసం ప్రతి ఒక్కరు అయిదుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు..అప్పుడే హిందు సమాజం అభివృద్ది చెందుతుందని సమర్ధించుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై కూడ కామెంట్ చేశాడు. లండన్ సోనియాగాంధీ చేసినట్టుగానే ఇక్కడ స్వప్న చౌదరి కూడ డాన్స్ వృత్తిలో ఉందని అన్నారు.ఈ నేపథ్యంలోనే స్వప్న చౌదరిని పెళ్లి చేసుకోవాలని అన్నారు.
60 సంవత్సరాలు ఉన్న మాయవతి అందంగా కనిపిస్తోంది..
మరోవైపు యూపి బీఎస్పీ అధినేత మాయవతిని కూడ వదిలిపెట్టలేదు. ఆమే అందంగా కనిపించడంతో పాటు తన 60 సంవత్సరాల వయస్సు కనిపించకుండా ఫెషియల్ చేసుకోవడంతోపాటు తలకు రంగులు కూడ వేసుకుంటుందని అన్నారు. ఈనేపథ్యంలోనే మహిళలపై అత్యాచారాలు,దాడులు పెరగడానికి తల్లిదండ్రులు వ్వవహారశైలి కారణమనే వ్యాఖ్యలు చేశారు. ఇలాంటీ వ్యఖ్యలు చేసిన నేపథ్యంలో కూడ ఆయనపై పార్టీ ఎలాంటీ చర్య తీసుకోని పరిస్థితి మరి ఈ ఏకంగా మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్పై ఎలాంటీ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.