Students: అయ్యప్ప మాల వేసుకుని స్కూల్ కు వెళ్లాడని చితకబాదని ముస్లీం విద్యార్థులు ?
బెంగళూరు/మంగళూరు: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి స్కూల్ కు వెళ్లాడు. ఎప్పటిలాగే స్కూల్ క్లాసులకు హాజరైనాడు. మద్యాహ్నం భోజనం సమయంలో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి స్కూల్ ఆవరణంలోకి వెళ్లాడు. ఆ సందర్బంలో నువ్వు మాల వేసుకుని స్కూల్ కు వస్తావా ? అంటూ సీనియర్ విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని చితకబాదారని వెలుగు చూడటం కలకలం రేపింది.
కర్ణాటకలోని మంగళూరు సిటీలో క్రిస్టియన్స్ ట్రస్ట్ కు చెందిన స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లీం అబ్బాయిలు, అమ్మాయిలు చదువుకుంటున్నారు. 8వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇటీవల అయ్యప్ప మాల వేసి ధీక్ష చేప్టాడు. కొన్ని రోజుల నుంచ ఆ అబ్బాయి మాల వేసుకుని స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు.

మద్యాహ్నం భోజనం చేసి బయటకు వచ్చిన అయ్యప్ప మాల వేసిన విద్యార్థిని ముస్లీం మతానికి చెందిన కొందరు అబ్బాయిలు అడ్డగించారని ఆరోపణలు ఉన్నాయి. నువ్వు మాల వేసుకుని స్కూల్ కు వస్తావా ? అంటూ సీనియర్ విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని ముస్లీం అబ్బాయిలు స్కూల్ లోనే చితకబాదరని వెలుగు చూసింది.
ఇంటికి వెళ్లిన అబ్బాయి అతని కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు.. అయ్యప్ప మాల వేసిన అబ్బాయి కుటుంబ సభ్యులతో పాటు హిందూ సంఘాలు స్కూల్ లోకి వెళ్లి టీచర్లను నిలదీశాడు. తన మీద రియాజ్, నసీఫ్, పాషా తదితరులు దాడి చేశారని టీచర్లకు చెప్పినా పట్టించుకోలేదని అయ్యప్ప మాల వేసిన విద్యార్థి ఆరోపించాడు. అయితే రెండు వర్గాల మద్య గొడవ జరిగిందని, ఇది చిన్న విషయం అని అదే స్కూల్ లో సీనియర్ టీచర్ గా పని చేస్తున్న ఫెలిక్స్ డిసౌజా చెప్పాడని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications