అమానుషం: 70 మంది విద్యార్థినులను నగ్నంగా చేసి తనిఖీ, అందుకోసమేనా?
ఉత్తర్ ప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో విధ్యార్థినులను నగ్నంగా చేసి ఓ వార్డెన్ అతి దారుణంగా ప్రవర్తించింది. వరుసగా 70 మంది విద్యార్థినులను నిలబెట్టి మరీ చెక్ చేసింది.
లక్నో:ఉత్తర్ ప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో విధ్యార్థినులను నగ్నంగా చేసి ఓ వార్డెన్ అతి దారుణంగా ప్రవర్తించింది. వరుసగా 70 మంది విద్యార్థినులను నిలబెట్టి మరీ చెక్ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్ 70 మంది విద్యార్థినులను వరుసగా నిలబెట్టింది.
అయితే వరుసగా విద్యార్థినులను బట్టలు విప్పేయాలని వార్డెన్ ఆదేశించింది. బట్టలు విప్పేయని విద్యార్థినులపై చితకబాదుతానని ఆమె హెచ్చరించింది.
దీంతో విద్యార్థినులను వరుసగా నిలబెట్టి తనిఖీలు చేసింది వార్డెన్. ఈ ఘటన పట్ల విద్యార్థినులు తమ కుటుంబసభ్యులకు పిర్యాదు చేశారు. అంతేకాదు మీడియా వద్ద కూడ విద్యార్థినులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆ వార్డెన్ ను ఉద్యోగం నుండి తొలగించారు. అయితే ఆ వార్డెన్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకొంది. హాస్టల్ బాత్ రూమ్ లో ఓ చోట రక్తం మరకలు కన్పించాయని చెప్పింది.
ఎవరికి ఎలాంటి సమస్య ఉందో చెప్పేందుకు అమ్మాయిలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున వారి ఆరోగ్యానికి హని జరగకుండా చూడాలని తాను ప్రయత్నించినట్టు తెలిపింది.
బాధితురాలు ఎవరో గుర్తించేందుకే తాను విద్యార్థినుల బట్టలు విప్పేయాల్సి వచ్చిందని వార్డెన్ వివరణ ఇచ్చారు. చదువు విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని, అందుకే చాలా మందికి తాను నచ్చడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు ఉన్నతాధికారులు.