నిర్మలాదేవితో నా భర్తకు ఎలాంటి సంబంధాల్లేవు, గవర్నర్ వద్దకు ఎలా వెళ్ళింది?: మురుగున్ భార్య
చెన్నై: నిర్మలాదేవి వ్యవహారంలో తన భర్త మురుగన్, కరుప్పస్వామిని బలిపశువుగా మార్చి కేసును ముగించాలని చూస్తున్నారని మురుగన్ సతీమణి సుజా ఆరోపించారు. ఆమె శనివారం మధురై పర్యాటక బంగ్లాలోని సంతానం కమిషన్ సమక్షంలో హాజరై ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
గవర్నర్ వద్దకు నిర్మలాదేవిని వెళ్లనిచ్చింది ఎవరు అని మురుగన్ సతీమణి సుజా ప్రశ్నించారు. నిర్మలాదేవితో తన భర్తకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తన భర్త అమాయకుడన్నారు. నాలుగు నెలలుగానే నిర్మలాదేవి తెలుసునని చెప్పారు. మూడుసార్లు మాత్రమే ఆమెను కలిసే సందర్భం తన భర్తకు వచ్చిందన్నారు.
నిర్మలాదేవి వ్యవహంరో నేపత్యంలో మధురై కామరాజు విశ్వవిద్యాలయం అధికారి ఒకరు తమను కలిసి కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లాలని లేకుంటే పోలీసులు గూండా చట్టం కింద అరెస్టు చేస్తారని హెచ్చరించారన్నారు.
కాలేజ్ అమ్మాయిలు లైంగిక ఉచ్చులోకి: సెంట్రల్ జైల్లో మేడమ్ విచారణ, ఎంత మంది!
ఎందుకు భయపడాలనే ఉద్దేశ్యంతో తన భర్త విచారణకు హాజరయ్యారని, అప్పుడు ఆయనను అరెస్టు చేశారన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గవర్నర్ దగ్గరకు నిర్మలా దేవి వెళ్లడానికి అనుమతించిందెవరని ప్రశ్నించారు. గవర్నర్తో కలిసి నిర్మలాదేవి ఉన్న ఫోటోను తీసిన వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.