ఆరు నెలలు యువతితో ఎంజాయ్ చేసిన టెక్కి: నీకు దిక్కునచోట చెప్పుకో, రేప్ కేసులో !
ఫేస్ బుక్ లో యువతితో పరిచయం పెంచుకుని తరువాత ఆమెను ముగ్గులోకి లాగి ప్రేమ పేరుతో ఎంజాయ్ చేసి మోసం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులు అరెస్టు చేశారు.
మైసూరు: ఫేస్ బుక్ లో యువతితో పరిచయం పెంచుకుని తరువాత ఆమెను ముగ్గులోకి లాగి ప్రేమ పేరుతో ఎంజాయ్ చేసి మోసం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులు అరెస్టు చేశారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న ప్రేమ్ పటేల్ (28) అనే వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
సాఫ్ట్ వేర్ ఇజనీరుగా పని చేస్తున్న ప్రేమ్ పటేల్ సోషల్ మీడియాలో చూరుకుగా ఉన్నాడు. ఇతను ఫేస్ బుక్ లో 24 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.
గత ఆరు నెలల నుంచి ఆమెను శారీరకంగా దగ్గర చేసుకుని ఎంజాయ్ చేశాడు, ఆమె గర్బవతి కాకుండా జాగ్రత్త పడ్డాడు. తరువాత ఆమెకు తెలీకుండా మరో యువతిని ప్రేమించి ఆమెతో జల్సా చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఫేస్ బుక్ ఫ్రెండ్ చెప్పింది.
పెళ్లికి నిరాకరించిన ప్రేమ్ పటేల్ నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ్ పటేల్ ను అరెస్టు చేసి ఇతను ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశాడు ఆని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.