విడుదల చేయండి: 23 ఏళ్లుగా జైల్లో రాజీవ్ కిల్లర్ నళిని
రాజీవ్గాంధీ హత్యకేసులో మరణశిక్ష పడిన మురుగన్, శాంతన్, పేరరివాలన్లు క్షమభిక్షకోరుతూ రాష్ట్రపతిని అభ్యర్థించగా దానిపై 10 సంవత్సరాలుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సదాశివం ఈ ముగ్గురి విడుదలపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఫిబ్రవరి 19వ తేదీన నళిని సహా రాజీవ్ హంతకులు ఏడుగురిని విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే తమిళ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రప్ర భుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఆ
పిటిషన్ విచారణ మంగళవారం జరుగనున్న నేపథ్యంలో నళిని తరఫు న్యాయవాది రాధాకృష్ణన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. గత 23 ఏళ్లుగా జైలులో వున్న తనను విడుదల చేయాల్సిందిగా నళిని ఆ పిటిషన్లో అభ్యర్థించారు.