రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్
గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివాహం కోసం ఆరు నెలల పాటు సాధరణ సెలవు కావాలని నళిని సుప్రిం కోర్టులో పిటిషన్ వేసింది.దీంతో మద్రాస్ హై కోర్టు 30 రోజుల పాటు పెరోల్ జారీ చేసింది.
కాగా 27 సంవత్సరాలుగా రాజీవ్ హత్య కేసులో వెల్లోర్ సెట్రల్ జైలులో నళిని శ్రీహరన్ జైలు శిక్ష అనుభవిస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో నెల రోజుల పాటు పెరల్ లభించడం ఇదే మొదటి సారి. కాగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల సాధరణ సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంది. కాని ఆమేకు ఎలాంటీ సెలవులు లభించలేదు.ఇక దీనితో పాటు ఆర్టికల్ 161 ప్రకారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయవచ్చు అంటూ 1994లో ప్రభుత్వం ఓ స్కీమ్ను తీసుకువచ్చింది. దాని ప్రకారం రిలీజ్ చేయాలంటూ నళిని తన పిటిషన్లో వేడుకున్నది.ఈనేపథ్యంలోనే ఆరునెలల పాటు తన కూతురు వివాహం కోసం కూడ పెరోల్ ఇవ్వాలంటూ పేర్కోంది.
కాగా పెరోల్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు పెరోల్ రోజుల్లో మిడీయాతో మాట్లాడడం గాని, రాజకీయనాయకులతో సమావేశాలు గాని చేయకూడదని ఆదేశించింది.కాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణదండను విధించిన కోర్టు తిరిగి దాన్ని యావజ్జీవ శిక్షగా ప్రకటించిన విషయం తెలిసిందే.