నమో అధికారంలోకి....నమో టీవీ అజ్ఝాతంలోకీ...
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రచారం చేసిన నమోటీవీ ఇప్పుడు ఎక్కడుంది, ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటిలో కనిపించిన నమోటీవీ తన ప్రచారాన్ని కొనసాగిస్తుందా.... మోడీ ప్రధాని కావాలని ప్రచారం చేసిన నమో టీవీ ఎక్కడుంది.... ప్రస్తుత ఎన్నికల్ల మోడీ మాత్రం మళ్లి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా ఎన్నికల అనంతరం ఆయనకు ప్రచారం చేసిన టీవీ మాత్రం కనిపించడం లేదు
ఎన్నికల నేపథ్యంలో నమో టీవీ అంటూ ప్రచారం జరిగింది. అందులో ప్రధాని నరేంద్రమోడీ ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వూలు మాత్రం టెలికాస్ట్ అయ్యాయి. ఈ చానల్ సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో ప్రజల ముందుకు వచ్చింది. కాగా ఛానల్ ప్రజల ముందుకు వచ్చిన అనతికాలంలోనే వివాదానికి గురైంది. దీంతో ప్రారంభించిన కోద్దికాలంలోనే ప్రజల నుండి దూరమైంది.
నమో టీవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్టుబడితో సార్వత్రిక ఎన్నికల ముందు ఎయిర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎన్నికల నేపథ్యంలోనే టీవీ ప్రచారం చేసే కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై ఎన్నికల కమీషన్ దృష్టి సారించింది. దీనిపై వివరాలు ఇవ్వాలంటూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టీంగ్ శాఖను ఆదేశించింది. దీంతో ఇది భారతీయ జనతా పార్టీ ద్వార వచ్చిందని ,స్పష్టం చేసింది.కాగా చానల్కు ఎలాంటీ పర్మీషన్ లేదని స్పష్టం చేసింది.దీంతో ప్రతిపక్షాలు నమోటీవీని రద్దు చేయాలంటూ ఎన్నికల కమీషన్కు పిర్యాదు చేసిన నేపథ్యంలోనే టీవీలో వచ్చే కార్యక్రమాలు ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పింది.
అయితే ఎన్నికల అనంతరం ఈ పరిణామలపై స్పందిస్తూ...ఎన్నికల చట్టాలను అతిక్రమించి మోడీ నమో టీవీతోపాటు ఎన్నికల షెడ్యుల్ నుండి నమోటీవీ, మరియు కేదార్నాథ్ ఆలయ సందర్శన లాంటీ వాటిల్లో ఈసీ ప్రధాని మోడీ అనుకూలంగా,పక్షపాతంగా పని చేసిందని ఆయన ఆరోపించారు. కాగా ఈసీ భయంతో కూడిన భక్తితో పనిచేసింది తప్ప, ఈసీ చేసిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.