బీజేపీకి మరో షాక్! నమో టీవీలో రాజకీయ ప్రసారాలకు ఈసీ బ్రేక్!
ఢిల్లీ : ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మోడీ బయోపిక్ విడుదలకు నిరాకరించిన ఎన్నికల కమిషన్.. తాజాగా నమో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించింది.
మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..!
నమో టీవీలో ప్రసారమయ్యే రాజకీయ ప్రసంగాలు, పొలిటికల్ యాడ్స్కు సంబంధించి ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నమో టీవీలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అప్రూవ్ చేసిన కంటెంట్ను మాత్రమే ప్రసారం చేయాలని ఈసీ స్పష్టం చేసింది. డీటీహెచ్ సర్వీసుగా నమోదైన నమోటీవీలో రాజకీయపరమైన రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అన్నింటికి ముందస్తు అనుమతి తీసుకుని మాత్రమే ప్రసారం చేయాలని చెప్పింది. ఎంసీఎంసీ సర్టిఫికేషన్ లేకుండా ప్రసారం చేసిన కంటెంట్ను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది. నమో టీవీలో ఇకపై ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి ఉండాలని ఈసీ స్పష్టంచేసింది.