వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 మంది శిష్యురాళ్లతో లైంగిక సంబంధం: సాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayan Sai
సూరత్: తనకు ఎనిమిది మంది శిష్యురాళ్లతో లైంగిక సంబంధం ఉన్నట్లు స్వామీ ఆశారం బాపు తనయుడు నారాయణ సాయి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన సూరత్ అమ్మాయితో కూడా తనకు సంబంధం ఉందని అతను చెప్పినట్లు సమాచారం. గుజరాత్ పోలీసులకు ఆ విషయాలను విచారణలో నారాయణ సాయి వెల్లడించినట్లు తెలుస్తోంది.

తీవ్రంగా విచారించిన తర్వాత తనపై ఆరోపణలు చేసిన సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లతో ఒకామెతో తనకు లైంగిక సంబంధం ఉందని నారాయణ సాయి అంగీకరించినట్లు సూరత్ పోలీసు కమీషనర్ రాకేష్ ఆస్థానా మీడియాతో చెప్పారు. ఒక సేవికతో సంతానం కూడా కలిగినట్లు నారాయణ సాయి చెప్పినట్లు రాకేష్ అస్థానా చెప్పారు

సూరత్‌లోని ఆశ్రమంలో 2002 - 05 మధ్యకాలంలో తనపై నారాయణ సాయి అత్యాచారం చేశాడని ఓ అమ్మాయి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నారాయణ సాయిని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు.

40 ఏళ్ల నారాయణ సాయికి లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. అతనికి లైంగిక సామర్థ్యం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాయిని పోలీసులు ఇటీవల హర్యానాలో డ్రైవర్ రమేష్ మల్హోత్రా, పిఎస్ఓ కౌశల్ ఠాకూర్ అలియాస్ హనుమాన్‌లతో పాటు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 58 రోజుల పాటు అతను పోలీసుల కళ్లు గప్పి సంచరించాడు.

English summary
Self-styled godman Asaram’s son Narayan Sai, accused in a rape case has confessed to Gujarat police officials of having relation with eight women and also having physical relation with the Surat girl, who has accused him of raping her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X