మహారాజ్ కేసు: ఆనంద్ గిరి అరెస్ట్.. మరో ఇద్దరు కూడా
అఖిల భారతీయ అఖండ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ పరమపదించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్న.. పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో విచారణ స్పీడప్ చేశారు. శిష్యుడు ఆనంద్ గిరిని అరెస్ట్ చేశారు. అతనిని హరిద్వార్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఉత్తరాకండ్ పోలీసులు సహకరించారు. సూసైడ్ నోట్లో గురుజీ ఆద్య తివారీ పేరు కూడా ప్రస్తావించారు. అతను హనుమాన్ ఆలయంలో పండితుడిగా పనిచేస్తున్నారు. అతని కుమారుడు సందీప్ తివారీ పేరు కూడా వినిపించింది. వీరిద్దరినీ పోలీసుల కస్టడీకి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో గల నివాసంలో మహారాజ్ విగతజీవిగా మారారు. మహారాజ్ మృతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆశ్రమం తదనంతరం ఎవరూ చూసుకునే అంశాన్ని ప్రస్తావించారు. శిష్యుడు ఆనంద్ గిరీ పేరు ఉందని పోలీసులు తెలిపారు. కానీ ఆయన తన పేరుతో కొందరు కుట్ర చేస్తున్నారని ఆనంద్ ఆరోపించారు. భూ మాఫియా పేరును ప్రస్తావించారు. దీంతో మహారాజ్ ఎలా చనిపోయారనే సందేహాలు వస్తున్నాయి.
Recommended Video
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాజ్ హఠాన్మరణం కాషాయ దళానికి ఇబ్బంది కలిగించేది. విచారణలో నిజ నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. మహారాజ్ తన గదిలో ఉరి వేసుకొని చనిపోయారు. నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నారని.. డోర్ తగులగొట్టేసరికి అచేతనంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే మహారాజ్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. మహారాజ్ రాసిన సూసైడ్ నోట్లో ఆశ్రమానికి సంబంధించి వ్యవహారాలను ఎవరు చూసుకోవాలనే అంశానికి సంబంధించి వీలునామా కూడా రాశారు. అందులో ఆనంద్ గిరి పేరు ఉంది. ఇతర శిష్యుల పేర్లను కూడా మహారాజ్ ప్రస్తావించారు. వారిలో ఆద్య ఒకరు.. అతని కుమారుడు పేరు కూడా హత్య కేసులో పోలీసులు నమోదు చేశారు.