సోఫాలో కూర్చునేందుకు నిరాకరించిన ప్రధాని మోడీ...! ఎందుకో తెలుసా...? వీడీయో
రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తన సింపుల్ సిటిని ప్రదర్శించారు. సమావేశం ముగిసిన అనంతరం ఫొటో సెషన్ కొనసాగింది. అయితే మోడీ కూర్చునేందుకు ప్రత్యేకంగా వేసిన సోఫాలో ఆయన కూర్చునేందుకు నిరాకరించారు. ఇతరులు కూర్చునేందుకు వేసిన కుర్చినే వేయించుకుని ఫోటోకు ఫోజించారు. దీంతో ఆ వీడీయోను కేంద్రమంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడీయాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడీయోపై నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.
జీడీపీ కాదు.. 'జీహెచ్పీ'ని కోరుకుంటున్నారు: ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 4 ,5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించారు. ఈ సంధర్భంగా ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వెళ్లిన నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం అయ్యారు.రష్యాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు అంశాలపై 25 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అయితే అంతకుముందు రష్యాకు చేరుకున్న ప్రధానికి అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఇందులో భాగాంగనే ఫోటో సేషన్ నిర్వహించారు. ఫోటో సెషన్లో ప్రధాని మోడీ కూర్చునేందుకు ప్రత్యేక సోఫా కుర్చిని వేశారు. దీన్ని గమనించిన మోడీ ప్రత్యేక కూర్చిలో కూర్చునేందుకు నిరాకరించారు. అందరితో సమానంగా కుర్చునేందుకు ఇష్టపడ్డారు.
ఇక ఈ వీడీయోను స్వయంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్లో సోషల్ మీడీయాలో పోస్ట్ చేయడంతో నెటజన్లు ప్రధాని మోడీ వ్యవహరా శైలిని ప్రశంసించారు. ఆయన ఆసాధరణ వ్యవహార శైలీ కి వర్ణించేందుకు మాటలు రావడం లేదని, సాధరణ అలవాట్లవల్లే ప్రజల్లో ఆధరణ పొందుతున్నారని దేశంలో ఎప్పుడు ఏం చేయాలో ప్రధాని మోడీకి తెలుసని పలువురు ట్విట్టర్లో పేర్కోన్నారు.