మోడీ, నటి రేఖ హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బాలీవుడ్ అలనాటి తార, రాజ్యసభ సభ్యురాలు రేఖ హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీలుగా ఎంపికయ్యారు. ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమిల్స్ (పెటా) ఆ విషయాన్ని ప్రకటించింది. సినీ తారలు కంగనా రనౌత్, షాహిద్ కపూర్లతో పాటు అమితాబ్ బచ్చన్, ఆర్ మాధవన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, హేమమాలిని కూడా పోటీ పడ్డారు.
ఆ ఎంపిక చేయడానికి పెటా నిర్వహించిన పోటీలో వేలాది ఓట్లు పడ్డాయి. చివరికి మోడీ, రేఖ అగ్రస్థానంలో నిలిచినట్లు పెటా ఓ ప్రకటనలో తెలిపింది. తన జీవితంలో ఎక్కువ భాగం శాకాహారిగానే ఉన్నానని, అది ఆలోచనా విధానాన్ని, జీవిత నడవడికను ప్రభావితం చేస్తుందని రేఖ అన్నారు.
జీవితంలో ఫిట్గా ఉండడానికి మోడీ యోగా చేస్తారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసినప్పుడు కూడా మోడీ జంతు సానుకూలమైన శాకాహారాన్నే తీసుకుటారు. మాంసాహారం తినడాన్ని వ్యతిరేకిస్తూ శాకాహారారానికి అనుకూలంగా ప్రతి చోట చైతన్యం కలిగించే పనిని కూడా వారిద్దరు చేసినట్లు పెటా తెలిపింది.
దయాగుణానికి మించింది ఏదీ లేదని ఇద్దరు పెటా ఇండియా విజేతలు నిరూపించినట్లు తెలిపారు. భోజనానికి కూర్చున్న ప్రతిసారీ ఆ దయాగుణాన్ని వారు ప్రదర్శించినట్లు పెటా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ పూర్వ జోషిపురా అన్నారు.