వన్ ఇండియా తెలుగులో కలామ్పై మోడీ వ్యాసం: ట్విట్టర్లో హల్చల్
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలామ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ రాసిన వ్యాసం ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. నరేంద్ర మోడీ ఎపిజె అబ్దుల్ కలామ్పై రాసిన వ్యాసం తెలుగు అనువాదాన్ని వన్ ఇండియా తెలుగులో ప్రచురించడం జరిగింది. దాన్ని మోడీ ట్వీట్ చేశారు.
మోడీ చేసిన ట్వీట్ సందడి చేస్తోంది. మహోన్నతుడు డా. కలామ్ గురించి కొన్ని ఆలోచనలు అంటూ మోడీ ఆ వ్యాసాన్ని ట్వీట్ చేశారు. ఆ ట్విట్టర్ వ్యాఖ్యను నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కలామ్ ఆలోచనలు భారత దేశం అభ్యున్నతికి ఎలా తోడ్పడుతాయనే విషయంపై మోడీ వ్యాసం రాశారు.
మహోన్నతుడు
డా.
కలాం
గురించి
కొన్ని
ఆలోచనలు
http://t.co/Oobkve3JIl
—
Narendra
Modi
(@narendramodi)
July
30,
2015
అబ్దుల్ కలామ్ మహోన్నత వ్యక్తిత్వంపై ఆయన మోడీ తన ఆలోచనలతో ఆ వ్యాసం రాశారు. తద్వారా ఆయన కలామ్కు ఘన నివాళి అర్పించారు.
వన్ ఇండియా కన్నడంలోనూ మోడీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని కూడా మోడీ ట్వీట్ చేశారు. అది కూడా ట్విట్టర్లో సందడి చేస్తోంది. వివిధ రంగాలపై ఎపిజె అబ్దుల్ కలామ్ దృక్పథాన్ని, ఆయన ఆలోచనలను వివరిస్తూ అవి భారతావనికి ఎలా వెలుగులు నింపుతాయో నరేంద్ర మోడీ తన వ్యాసంలో చెప్పారు.