కేదార్నాథ్ లో ప్రధాని మోడీ.. ఆలయ సందర్శన, పూజలు, శంకుస్థాపనలు
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సందర్శించారు. నిన్న ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ సెక్టర్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలి
Recommended Video
ఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సందర్శించారు. నిన్న ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ సెక్టర్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
అదే ఆయన కుటుంబం: మోడీ దీపావళి వేడుకలు.. వరుసగా నాలుగే ఏడాదీ సైనికులతోనే...
అనంతరం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ జలీగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడ్నించి కేదార్నాథ్ వెళ్లారు.
ఈ సీజన్లో ప్రధాని మోడీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. మే 3న ఆలయ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం మరోసారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించిన మోడీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో కేదార్ నాథ్ కు వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఆ ఆలయాన్ని ఏటా ఆరు నెలలపాటు మూసి ఉంచుతారు. ఈ ఏడాది మేలో ఈ ఆలయ ద్వారాలు తెరిచారు. తిరిగి రేపు.. అంటే శనివారం మూసివేయనున్నారు.