వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ రచ్చ: నారిమన్ ఔట్ ? కపిల్ సిబాల్ ఇన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం తరపున ఇంతకాలం సుప్రీం కోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారిమన్ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వానికి మద్దతుగా వాదించడానికి నారిమన్ వెనకడుగు వేస్తున్న సందర్బంలో మరో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు కపిల్ సిబాల్ ను నియమించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నదని సోమవారం వెలుగు చూసింది.

గతవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల కేసు వాదించే సమయంలో నారిమన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇచ్చిన పత్రాలు ముందు పెట్టుకుని వాదించారు. ఆ సందర్బంలో తాను కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించడానికి సిద్దంగా లేనని చెప్పారు.

Nariman refusing to argue the Cauvery waters matter for Karnataka

సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన కేసు వాదించడానికి వెనకడుగు వేశారని సమాచారం. అయితే కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల పంపిణి వివాధం కేసులో నారిమన్ వాదనలు వినిపిస్తారని స్పష్టం చేసింది.

ఇదే సందర్బంలో నారిమన్ కేసు వాదించడానికి సిద్దంగా లేకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చర్చించారు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కపిల్ సిబాల్ కు వివరించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

English summary
Fali S Nariman refusing to argue the Cauvery waters matter for Karnataka, the government is in talks with Kapil Sibal. Nariman had told the Supreme Court last week that he would not argue the case for Karnataka as it was not following the orders of the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X