లక్షద్వీప్ లో కూడా అభ్యర్థిని దింపారు! కుమార్తెకే తొలి ప్రాధాన్యత..తొలి జాబితా విడుదల!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీ నేషనలిస్ కాంగ్రెస్ పార్టీ..తన తొలి జాబితాను ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 12 అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో నాలుగు దశల్లో మిగిలిన అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని ఎన్సీపీ నాయకులు తెలిపారు. తొలి జాబితాలో సుప్రియా సూలేకు స్థానం కల్పించారు. సుప్రియా సూలే.. ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె. ఈ 12 స్థానాల్లో ఒకటి లక్షద్వీప్ కావడం విశేషం.
వైఎస్ఆర్ సీపీలో చేరిన దాసరి అరుణ్! కర్నూలు జిల్లా టీడీపీ నేత కూడా చేరిక!
సుప్రియా సూలేకు బారామతి స్థానాన్నే కేటాయించారు. ప్రస్తుతం ఆమె అదే స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సుప్రియా అదే స్థానం నుంచి పోటీ చేస్తారు. సునీల్ తత్కారే-రాయగఢ్, ఉదయన్ రాజె బోస్లే-సతారా, ధనంజయ్ మహాదిక్-కొల్హాపూర్, డాక్టర్ రాజేంద్ర సింఘణే-బుల్ధానా, గులాబ్ రావు దేవ్ కర్-జల్ గావ్, రాజేశ్ విటేకర్-పర్భణీ, సంజయ్ దినా పాటిల్-ముంబై ఈశాన్యం, ఆనంద్ పరాంజపే-థానే, బాబాజీ బలరామ్ పాటిల్-కళ్యాణ్, రాజు షెట్టి (స్వాభిమాని షెట్కారీ సంఘటన్)- హట్కనంగలే.. పేర్లను ప్రకటించారు. కాగా, లక్షద్వీప్ లోక్ సభ స్థానానికి మహమ్మద్ పీపీ ఫైజల్ పేరును ప్రకటించారు.