ఎన్నికల ఫలితాలు... హింస చెలరేగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి...రాజ్నాథ్ సింగ్
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పలు రాష్ట్ర్రాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయా రాష్ట్ర్రాలను అప్రమత్తం చేశారు. ఫలితాల సంధర్భంగా పలు రాష్ట్ర్రాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర్రాల డీజీపీలు ,రాష్ట్ర్ర పభుత్వ కార్యదర్శులను ఆయన అప్రమత్తం చేశారు. కోన్ని రాష్ట్ర్రాల్లో సంస్థలు ,వ్యక్తుల ద్వార దీనికి అవకాశం ఉందని ఆయ తెలిపారు.
ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర తోపాటు రాష్ట్ర్రాల్లో హింస చేలరేగే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. వీటీకి సంబంధించి కొన్ని నివేదికలు కూడ ఆయా రాష్ట్ర్రాలకు అందించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అల్లర్లు చెలరేగవచ్చని హోంమంత్రి పంపించిన నివేదికలో పేర్కోన్నారు. కాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్డడంతో పాటు అప్రమత్తగా ఉండాలని ఆయన సూచించారు. కాగా ఎన్నికల సంధర్భంలో పశ్చిమబెంగాల్ , బీహార్ రాష్ట్ర్రాలలో ఎన్నికల సంధర్భంగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే...
కాగా బీహార్లో జరిగిన సంఘటనలతోపాటు ప్రతి పక్షాలు సైతం ఈవీఎంలలో గందరగోళం ,వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంలో ఈసీ నిర్ణయంపై సీరియస్ ఉన్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడ బీజేపీ అనుకూలంగా రావడంతో ఎలాంటీ అల్లర్లు లేకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం ఇలాంటీ హెచ్చరికలు జారీ చేసినట్టు పలువురు భావిస్తున్నారు.