రూల్స్ బ్రేక్: నో మాస్క్, నో గ్లౌజ్, నో సోషల్ డిస్టన్స్.. సిద్దూపై సీఎంకు అడ్వకేట్ ఫిర్యాదు
మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దుపై ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. మాస్క్ ధరించలేదని, సోషల్ డిస్టన్స్ పాటించలేదని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు కంప్లైంట్ చేశారు. దీనిని పంజాబ్ సీఎం కూడా ధృవీకరించారు. అయితే సదరు ఫిర్యాదు గురించి సిద్దూ స్పందించాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో బాధ్యతగా మెలగాల్సిన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. పంజాబ్ మాజీమంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం లేదు అని, సామాజిక దూరం పాటించడం లేదు అని ఫిర్యాదు వచ్చింది.
పంజాబ్ పర్యానా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న హెచ్సీ అరోరా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్కు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రవేశాల్లో సిద్దూ వ్యవహరించిన తీరుకు సంబంధించిన... ఫోటోలను కూడా అందజేశారు. చేతికి గ్లౌజ్ కూడా వేసుకోలేదని ప్రస్తావించారు. ఏకంగా మాజీమంత్రి నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని సీనియర్ అడ్వకేట్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించాల్సి ఉంది.