నేనేందుకు పార్టీ వీడుతా... తేల్చి చెప్పిన నవజ్యోత్ సింగ్ సిద్దూ...
మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీని విడేది లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి తర్వాత పార్టీ మారతారని వచ్చిన ప్రచారాన్ని ఆయన కోట్టిపారేశాడు. రాజీనామ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈనేపథ్యంలోనే తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశాడు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్తో ఎర్పడిన విబేధాలతో మంత్రి పదవికి రాజీనామ చేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూ తన మంత్రి పదవికి రాజీనామ చేశాడు. దీంతో అప్పటి నుండే పార్టీ మారతాడనే ప్రచారం కూడ కొనసాగింది. బీజేపీలో కొనసాగిన సిద్దూ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపోందాడు.
కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్దు హజరుకావడంతో ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, సిద్దూకు మధ్య అంతర్గత వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నుండి ఎన్నికైన తర్వాత ఆయన పంచాయితీ రాజ్ శాఖతోపాటు సాంస్కృతిక శాఖలను చేపట్టాడు. వీటితో పాటు మరిన్ని శాఖల భాద్యతలను కూడ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అప్పగించాడు..కాని ఇటివల ఇద్దరి మధ్య పలు కారణాల వల్ల వివాదం చెలరేగింది. కాగా ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ ప్రక్షాళన చేశాడు. ఇందులో భాగంగానే సిద్ధూకు ఉన్న కొన్ని శాఖలను తొలగించి, ఇతర శాఖలను అప్పగించాడు.అయితే సద్దూ మాత్రం ఆ భాద్యతలను చేపట్టకపోవడంతోపాటు కనీసం సెక్రటేరియట్కు కూడ వెళ్లని పరిస్థితి ఉంది.