ఛత్తీస్గఢ్లో ఎస్సైని హత్య చేసిన మావోయిస్టులు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కిడ్నాప్ చేసిన ఎస్సై కశ్యప్ను దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలి పెట్టి వెళ్లారు.
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?
అపహరణకు గురైన మరో వ్యక్తి జైసింగ్ కురేటి మాత్రం ఇంకా వారి చెరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. నక్సల్స్ చెరలో ఉన్న జైసింగ్ టీచర్. అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవలి నుంచి ఎస్ఐ లలిత్ కశ్యప్, ఆయన మిత్రుడు జైసింగ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్ను అరన్పూర్లోని సీఆర్పీఎఫ్ బెటాలియన్కు బదిలీ చేశారు. సమీప గ్రామంలో ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లారు. సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించి వారిని కిడ్నాప్ చేశారు.