మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు
ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి.
ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు
ఇంత పెద్ద మొత్తంలో యంత్రాలు, వాహనాలు కాలి బూడిద కావడంతో కాంట్రాక్టర్ లబోదిబమంటున్నాడు. ఆస్తినష్టం తీవ్రంగా జరిగిందని వాపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన ఇది రెండోది. జనవరిలో కూడా ఇలాగే పలు వాహనాలకు నిప్పంటించారు నక్సల్స్. ఏప్రిల్ 11వ తేదీన గడ్చిరోలిలో నక్సల్స్ కు, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దానికి ప్రతిఘటనగా ఈ దాడులు చేశారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Maharashtra: Naxals have set ablaze 27 machines and vehicles at a road construction site in Kurkheda of Gadchiroli district. pic.twitter.com/62c6iNuJU2
— ANI (@ANI) May 1, 2019