బీజేపికి యూపిలో 46 ,పశ్చిమ బెంగాల్ లో 12 స్థానాలు :India TV-CNX Opinion Poll
ఉత్తరాధి రాష్ట్రాల్లో బీజేపికి మరోసారి అనుకూల ప్రభావం కనిపిస్తోంది.ఉత్తరప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆపార్టీ కి మెరుగైన ఫలితాలను సాధించబోతున్నట్టు ఇండియా టీవి -సిఎన్ఎక్స్ ఒపినియన్ పోల్ ను వెలువరించింది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 46 ,మహఘట్బంధన్ 30
ఉత్తరప్రదేశ్
లో
బీజేపీ
పుంజుకుంటుంది.
గత
కొద్ది
రోజుల
క్రితం
ఉత్తారాధిన
ఉన్న
అతిముఖ్యమైన
రాష్ట్రాల్లో
బీజేపీ
పరిస్థితి
దిగజారిందని
పలు
వార్తలు
వెలువడ్డాయి.
అయితే
తాజాగా
ఇండియా
టీవీ-సిఎన్ఎక్స్
నిర్వహించిన
ఒపినియన్
పోల్
నిర్వహించింది.
యూపిలోని
మొత్తం
80
సీట్లకు
గాను
ఏన్డీఏ
పక్షాలు
46
పార్లమెంట్
సీట్లను
పోందనుండగా,
మహఘట్బంధన్
30
స్థానాలను
గెలిచే
అవకాశాలున్నయని
తెలిపింది.కాగా
కాంగ్రెస్
పార్టీ
4
స్థానాలకు
పరిమితం
కానున్నట్టు
పేర్కోంది.అయితే
గత
పార్లమెంట్
ఎన్నికల్లో
మొత్తం
80
స్థానాలకు
గాను
బీజేపీ
72
స్థానాలు
గెలుపొందింది.
అనంతరం
జరిగిన
ఉప
ఎన్నికల్లో
సీట్లను
కోల్పోయింది.దీంతో
అక్కడ
పార్టీ
ప్రభావం
తగ్గిందని
పలు
వార్తలు
వెలువడ్డాయి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఖాతా తెరవనున్న బీజేపీ
కాగా ఇప్పటివరకు పార్టీ ఖాతా తెరవని బీజేపీ పై ప్రజలు పాజీటీవ్ గా ఉన్నట్టు తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రేస్ పార్టీ 28 స్థానాలను గెలిచే అవకాశాలు ఉన్నయని తెలిపిన సర్వే ,తొలిసారిగా బీజేపీ 12 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు పేర్కోంది. ఇక కాగా అక్కడ ముప్పై అయిదు సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన లెఫ్ట్ పార్టీ , ఒక స్థానంతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం మరో స్థానాన్ని గెలుచుకునే అవకాశాలున్నట్టు ఒపినియన్ పోల్ ఫలితాల్లో ప్రకటించింది.
ఒడిశాలో
ఓడిశా లో బీజేడీ 14 లోక్ సభ స్థానాల్లో గెలుపోందే అవకాశాలు ఉండడంతో పాటు బీజేపీ కూటమీ 6 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని పేర్కోంది .ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ లు తమ ఒపినియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.