ఆయుధాలతో స్వాతంత్ర్యం రాదు,పెడదోవలో యువత : రావత్
శ్రీనగర్: ఆయుధాలతో స్వాతంత్ర్యం రాదని, ఉగ్రవాదులు సైన్యంతో పోరాడలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. భద్రతా దళాలు గత ఆదివారం జరిపిన కాల్పుల్లో కశ్మీరుకు చెందిన అధ్యాపకుడు మహ్మద్ రఫి భట్ మరణించిన సంగతి తెలిసిందే. రఫి మరణం తర్వాత బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయుధాలు చేపట్టినంత మాత్రాన కాశ్మీర్ యువత కోరుకొనే స్వాతంత్ర్యం రాదని ఆయన చెప్పారు. ఆజాదీ పేరుతో అరాచకం సృష్టించాలనుకుంటే సైన్యం చూస్తూ ఉండదన్నారు. అంతేకాదు మీరు కోరుకునే స్వతంత్రం ఎప్పటికి రాదని బిపిన్ రావత్ తెలిపారు. కొన్ని దేశవిద్రోహక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం 11 మంది యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతేకాదు భద్రతాబలగాలు ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమార్చాయి.. ఆదివారం జమ్ముకశ్మీర్లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు.