బూస్టర్ డోసు కూడా అవసరమే: కొత్త వేరియంట్లతో తప్పడం లేదు: గులేరియా
దేశంలో కరోనా కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాస్త భయాందోళన వ్యక్తమవుతోంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమని ఢిల్లీలో గల ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. భవిష్యత్లో కరోనా వైరస్ అనేక వేరియంట్లు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్తోపాటు బూస్టర్ మోతాదు అవసరం అవుతుందని అన్నారు.
రోగ నిరోధక శక్తి క్షీణించే సంకేతాలు కనిపిస్తున్నాయని గులేరియా అన్నారు. వ్యాక్సిన్ బూస్టర్ మోతాదు అవసరమని చెప్పారు. భవిష్యత్లో అభివృద్ధి చేయాల్సిన కొత్త వేరియంట్ల నుంచి బూస్టర్ డోసు రక్షించగలదని గలేరియా చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ కంపల్సరీ అవుతుందని చెప్పారు.
Recommended Video
రోగనిరోధక శక్తి విషయంలో వ్యాక్సిన్ గొప్పగా పనిచేస్తుందని చెప్పారు. కొత్త వేరియంట్లపై సమర్థవంతంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. టీకా బూస్టర్ మోతాదు విచారణ ప్రారంభమయ్యిందని, మొత్తం జనాభా వ్యాక్సిన్ రెండు డోసులను స్వీకరించిన తర్వాత, బూస్టర్ డోస్ కూడా ప్రభావం చూపిస్తుందన్నారు.
కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ వరకు భారత్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నారు. భారత్ బయోటెక్ కోవాక్జిన్ చాలా పురోగతి సాధించిందని, దాని విచారణ ఫలితాలు సెప్టెంబర్ వరకు బయటికి వస్తాయని చెప్పారు. అత్యవసర ఉపయోగం కోసం అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పిల్లలకు జైడస్ కాడిలా వ్యాక్సిన్ కూడా విచారణ చివరి దశలో ఉందన్నారు.