నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా(ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని, దివంగత జవహర్లాల్ నెహ్రూ 21వ శతాభ్ధానికి అత్యున్నత వ్యక్తి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొనియాడారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న 'అంతర్జాతీయ సదస్సు' లో ఆమె మాట్లాడారు.
విభిన్న మతాలు, జాతుల సమ్మేళనమే భారతదేశం అని చెప్పారు. సెక్యులరిజం లేనిదే ఇండియా లేదని చెప్పారు. ఈ సదస్సులో జల విద్యుత్ ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలన్న నెహ్రూ మాటలను సోనియా గాంధీ గుర్తు చేశారు.
నెహ్రూ వల్లే దేశంలో ఆధునీకరణ, పారిశ్రామీకీకరణ, సామాజిక సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు. విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మొదటి రోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీలన్నీ హాజరయ్యాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు.
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా
భారత తొలి ప్రధాని, దివంగత జవహర్లాల్ నెహ్రూ 21వ శతాభ్ధానికి అత్యున్నత వ్యక్తి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొనియాడారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న 'అంతర్జాతీయ సదస్సు' లో ఆమె మాట్లాడారు.
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా
విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మొదటి రోజు సదస్సులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రకాశ్ కారత్.
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా
విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మొదటి రోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీలన్నీ హాజరయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు.
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా
విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మొదటి రోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీలన్నీ హాజరయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు.
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు 50 దేశాల ప్రతినిధులు కూడా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ జీవిత విశేషాలపై కాంగ్రెస్ ఓ వెబ్ సైట్ ప్రారంభించనుంది.