నెహ్రూపై పటేల్ అసహనం: కాశ్మీర్పై అద్వానీ సంచలనం
తాజాగా మరో సంచలనం రేపారు. 1948లో కాశ్మీర్కు సైన్యాన్ని పంపించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారని తాజాగా తన బ్లాగులో పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు ప్రేమ్ శంకర్ ఝాకు అప్పటి కల్నల్ శాం మానెక్ షా ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనుల మద్దతుతో పాకిస్తాన్ దళాలు శ్రీనగర్ను సమీపిస్తున్న తరుణంలో భారత్ బలగాలను తరలించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో... నెహ్రూ తిరస్కరించారని, దీనిని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకు వెళ్లాలని భావించారని పేర్కొన్నారు. మహారాజా హరి సింగ్ విలీన ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత మౌంట్ బాటన్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని, అందులో నెహ్రూ, సర్దార్ పటేల్లు పాల్గొన్నారన్నారు.
మానెక్ షా అప్పటి మిలటరీ పరిస్థితిని వివరించి, భారత బలగాలను తరలించాలని సూచించగా, నెహ్రూ ససేమీరా అన్నారని, సహనం కోల్పోయిన పటేల్.. మీకు కాశ్మీక్ కావాలా లేదా దాన్ని వదిలేయాలనుకుంటున్నారా అని అడగ్గా, కాశ్మీర్ కావాలని నెహ్రూ జవాబిచ్చారని అయితే ఆదేశాలు ఇవ్వాలని పటేల్ కోరగా, ఆ తర్వాత తనకు ఆదేశాలిచ్చారని మానెక్ షా ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు అధ్వానీ పేర్కొన్నారు.