నేపాల్ యువతిని నిర్బంధించి మూణ్నెళ్లు రేప్
బెంగళూరు: ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చిన ఓ యువతిని ఓ సెక్యూరిటీ గార్డు నిర్బంధించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో బుధవారంనాడు వెలుగు చూసింది.
బాధితురాలు తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. రామ్సింగ్ అనే సెక్యూరిటీ గార్డు నేపాల్ రాజధాని ఖాట్మండులో తనకు తెలిసిన ఓ కుటుంబానకి చెందిన యువతిని ఉద్యోగం పేరుతో మూడు నెలల క్రితం నగరానికి పిలిపించాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - అప్పటి నుంచి ఆ యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. విధులకు వెళ్లే సమయంలో గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దీంతో యువతి తీవ్ర మానసిక, శారీరక హింసను అనుభవించింది.
బుధవారం రాత్రి ఇంటి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. ఆ సంస్థ కార్యదర్శి యోగేష్ బాధితారులికి అండగా నిలిచాడు. పోలీసులు యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని గురువారంనాడు అరెస్టు చేశారు.