వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్‌కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?

|
Google Oneindia TeluguNews

ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. నిర్మలా వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. దీంతో కేంద్రమంత్రి అశ్వని చౌబే రియాక్టయ్యారు. నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలిచారు.

తాను కూడా ఉల్లిగడ్డ తిననని అశ్వని చౌబే పేర్కొన్నారు. ఉల్లిగడ్డ కొనుగోలు చేయనప్పుడు తనకు వాటి ధర ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తమ ఇంటిలో ఉల్లిగడ్డ వాడమని ఆయన స్పష్టంచేశారు. తాను శాఖాహారినని, తనలాంటి వాళ్లకు ఉల్లిగడ్డ ధర గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంట్లో వాడని వస్తువుల గురించి, వాటి ధరల గురించి ఎలా తెలుస్తుందని అడిగారు.

Never tasted onions, how will I know about situation: Ashwini Choubey

ఉల్లి ధరల అంశం పార్లమెంట్‌లో ప్రకంపనలు రేపుతుంది. ధరల నియంత్రణ ఏం చర్యలు తీసుకున్నారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీంతో బుధవారం నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఇంట్లో ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి వాడబోమని చెప్పారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ నేతలు తమదైనశైలిలో స్పందించారు. ఒకడుగు ముందుకేసిన చిదంబరం.. అవకాడో పండు తింటారా అని నిర్మలా సీతారామన్‌ను అడిగారు.

English summary
Ashwini Choubey said he has never tasted onions and would not know the situation regarding the food staple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X