కర్ణాటకలో ఉప ఎన్నికలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాక్, బీజేపీ ప్రభుత్వం ? రెండు చోట్ల !
బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి భారత్ ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ఎన్నికలు తేదీ ప్రకటించడంతో రెబల్ ఎమ్మెల్యేలు షాక్ కు గురైనారు. రెండు చోట్ల మాత్రం ఉప ఎన్నికలు జరగడం లేదు.
పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !
రెండు నియోజక వర్గాల విషయం కోర్టులో విచారణ జరుగుతుండటంతో మిగిలిన 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం (సెప్టెంబర్ 21వ తేదీ) భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ నామినేషన్లు సమర్పించడానికి చివరి తేది. అక్టోబర్ 21వ తేదీ పోలింగ్ జరుగుతుంది, అక్టోబర్ 24వ తేదీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్), మస్కీ నియోజక వర్గాల ఉప ఎన్నికలు జరగడం లేదు. ఆర్ ఆర్ఆర్ నగర్, మస్కీ శాసన సభ నియోజక వర్గాల వివాదం కోర్టులో ఉండటంతో మిగిలిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కర్ణాటకలోని
ఉప
ఎన్నికల
జరిగే
నియోజక
వర్గాలు
ఇవే
!
1.
చిక్కబళ్లాపురం
2.
మహాలక్ష్మి
లేఔట్
(బెంగళూరు)
3,హోస్
కోటే
(బెంగళూరు
గ్రామీణ)
4,హణసూరు
5,
గోకాక్
6,
యశవంతపుర
(బెంగళూరు)
7,
అథణి
8,
కాగవాడ
9,
శివాజీనగర్
(బెంగళూరు)
10,
కేఆర్.
పేట్
11,
కేఆర్
పురం
(బెంగళూరు)
12,
హీరేకరూరు
13,
రాణేబెన్నూరు
14,యల్లాపుర
15,
విజయనగర్