త్వరలో రూ.20,రూ.50 కొత్త నోట్లు!..: అర్జున్ రామ్ మేఘ్వాల్
రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన తరహాలోనే ఇప్పుడున్న రూ.20, రూ.50 స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: గత నవంబర్ 8వ తేదీన దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టినా.. నేటికి కరెన్సీ కష్టాలు తీరనే లేదు. ఇదిలా ఉంటే, త్వరలోనే ఇప్పుడున్న చిన్న నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకోవచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన తరహాలోనే ఇప్పుడున్న రూ.20, రూ.50 స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.

కరెన్సీ కష్టాలను సాధ్యమైనంత మేర అధిగమించడానికి వీలైనంత ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు నగదు పంపిణీ చేయాలని ఆర్బీఐ సహా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నోట్ల రద్దుపై చాలా దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయన్నారు.
నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతతో పాటు ఎఫ్డీఐలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయని అర్జున్ రామ్ మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications