కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయం : మమతా బెనర్జీ
కొత్త ట్రాఫిక్ చట్టం నిబంధనల జరిమానలపై బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించడంతో దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడుతోంది. ఈనేపథ్యంలోనే నూతన వాహన సవరణ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తే లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు. అది చాల కఠినంగా ఉందని అమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైరల్ వీడియో : ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసిన మంత్రి.. నెటిజన్ల ప్రశంసలు
నూతన మోటారు వాహన సవరణ చట్టం ప్రజలను చాల ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పిన ఆమే పార్లమెంట్లోనే బిల్లును వ్యతిరేకించామని అన్నారు. ఇందులో జరిమానాలు ముఖ్యం కాదని ప్రజల అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల కోసం తీసుకువచ్చే చట్టాలు మానవత్వంతో కూడిన చట్టాలుగా ఉండాలని తెలిపారు.బెంగాల్లో ప్రమాదాలపై తీసుకుచ్చిన సేవ్ డ్రైవ్ సేవ్ లైఫ్ పై ప్రచారం చేస్తూ రోడ్డు భద్రతపై ప్రచారం చేశామని చెప్పారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఆమే తెలిపారు.
మరోపక్క కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిపారు. రోడ్ ప్రమాదాల ద్వార చనిపోవారిని రాష్ట్రాలు పట్టించుకోడం లేదంటూ పరోక్షంగా గుజరాత్కు చురకలు అంటించారు. గుజరాత్ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఈనేపధ్యంలోనే నూతన మోటారు వాహన చట్టాన్ని సానుకూల దృక్పథంతో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు,