వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.200నోట్లపై ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం!?..

అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోటుతో చిల్లర కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. మార్కెట్లో రూ.500నోట్లు అందుబాటులో ఉన్నా.. పెద్ద నోటుకు సరిపడా చిల్లర దొరకని పరిస్థితి. దీంతో రూ.200నోటును ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది.

చిల్లర కష్టాలకు చెక్: హై క్వాలిటీతో త్వరలో రూ. 200 నోటుచిల్లర కష్టాలకు చెక్: హై క్వాలిటీతో త్వరలో రూ. 200 నోటు

2017ఏడాది ముగియక ముందే ఈ కొత్త నోటును మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనివల్ల చిల్లర కష్టాలు తీరనుండగా.. లోయర్ డినామినేషన్ నోట్లకు సంబంధించిన డిమాండ్-సప్లై మధ్య అంతరం తగ్గనుంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

New Rs 200 notes not to be dispensed through ATMs?

అంటే, ఈ నోట్లను ఏటీఎంలలో అందుబాటులో ఉంచరు. కేవలం బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపేవారికి మాత్రమే వీటిని అందించునున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెద్ద నోటుకు, చిన్న నోటుకు మధ్య అంతరం భారీగా ఉండటంతో.. రూ.2వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా మారింది. కొత్త రూ.200నోటుతో ఈ కష్టాలు తీరిపోనున్నాయి. ఇకపోతే రద్దయిపోయిన రూ.1వెయ్యి నోటును ఆర్బీఐ ఇప్పుడప్పుడే ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసింది.

English summary
The Reserve Bank is expected to introduce Rs 200 notes in the coming months to ease pressure on lower-denomination currencies that are in short supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X