వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల‌కింద‌టే పెళ్లి: అంత‌లోనే ఆత్మ‌హ‌త్య: సూసైడ్ నోట్‌లో అస‌లు కార‌ణం

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించి, పెద్ద‌ల‌ను ఎదిరించి ఒక్క‌టైన ఓ ప్రేమజంట త‌నువు చాలించింది. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌మ ఆత్మ‌హ‌త్య‌కు పెద్ద‌ల వేధింపులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లా దొడ్డ బ‌ళ్లాపుర తాలూకా ప‌రిధిలోని వీరాపురంలో సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుల‌ను దొడ్డ బ‌ళ్లాపురలోని క‌చేరి పాళ్యకు చెందిన వెంక‌ట‌రాజు కుమారుడు విజ‌య్‌, శాంతిన‌గ‌ర ప్రాంతానికి చెందిన లీలావ‌తిగా పోలీసులు గుర్తించారు.

విజ‌య్‌, లీలావ‌తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిక్ బ‌ళ్లాపుర‌లో ఒకే క‌ళాశాల‌లో చ‌దువుకుంటున్న స‌మ‌యంలోనే వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని పెద్ద‌ల‌కు తెలియ‌జేశారు. వేర్వేరు కులాల‌కు చెందిన‌వారు కావ‌డం వ‌ల్ల ఇరు కుటుంబాల్లో పెద్ద‌లు వారి ప్రేమ‌ను ఆశీర్వ‌దించ‌లేదు. పెళ్లి చేయ‌డానికి నిరాక‌రించారు.

 Newly married Couple found dead on Railway track in Bengaluru Rural district

అయిన‌ప్ప‌టికీ- వారు పెద్ద‌ల‌ను ఎద‌రించి పెళ్లి చేసుకున్నారు. స‌రిగ్గా నెల‌రోజుల కింద‌ట త‌మ స్నేహితుల స‌హాయంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విష‌యం వారి కుటుంబీకుల‌కు తెలిసింది. ఆగ్ర‌హానికి గురైన ఇరు కుటుంబీకుల పెద్ద‌లు విడ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. దొడ్డ బ‌ళ్లాపుర పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విజ‌య్‌, లీలావ‌తిని స్టేష‌న్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొద్దిరోజుల పాటు వారిద్ద‌రూ వేర్వేరుగా నివ‌సించారు.

 Newly married Couple found dead on Railway track in Bengaluru Rural district

ఆదివారం వారిద్ద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లో నుంచి మాయం అయ్యారు. వారి కోసం అన్వేషిస్తుండ‌గా వీరాపుర వ‌ద్ద రైల్వే ప‌ట్టాల‌పై మృత‌దేహాలుగా క‌నిపించారు. మృత‌దేహాలను చూసిన కొంద‌రు స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టాల ప‌క్క‌న విజ‌య్‌కు చెందిన బైక్‌, దాని ప‌క్క‌నే ఆత్మ‌హ‌త్య లేఖ క‌నిపించింది. ఈ లేఖ‌ను లీలావ‌తి రాసిన‌ట్టుగా చెబుతున్నారు. త‌న మామ తీవ్ర వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని, అందువ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆత్మ‌హ‌త్య లేఖ‌లో రాసి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

English summary
Newly married Couple found dead on Railway track in near Veerapura village, Doddaballapura Taluk in Bengaluru Rural District on Monday. Both couple identified as Vijay and Leelavathi residence of Doddaballapura town, Police said. Police recovered a Bike and a suicide note allegedly wrote by the Couple. Both Vijay and Leelavathi was married a month ago, without Permission from the Parents
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X