News18-IPSOS exit poll: 243 సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్, హర్యానా కమలమయం
ముంబై: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది. ఆ తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రెండు రాష్ట్రాల్లోను బీజేపీ కూటమిదే హవా అని, ఆ పార్టీ సునాయాసంగా అధికారం చేజిక్కించుకుంటుందని వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవా
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన విజయ విహారం
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన-మిత్రపక్షాల కూటమి 288 స్థానాలకు గాను ఏకంగా 243 సీట్లు గెలుచుకుంటుందని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన ఈ పార్టీలు 186 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గతంలో కంటే అరవై వరకు సీట్లు ఎక్కువగా వస్తాయని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇప్పుడు కలిసి పోటీ చేసినా గతంలో కంటే సగానికిపైగా సీట్లు కోల్పోనున్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే?
బీజేపీ
-
శివసేన
-
మిత్రపక్షాల
కూటమి
288
సీట్లకు
గాను
243
సీట్లు
గెలుచుకుంటుంది.
బీజేపీకి
141
సీట్లు,
శివసేనకు
102
సీట్లు
వస్తాయని
News18-IPSOS
సర్వే
ఎగ్జిట్
ఫోల్
ఫలితాలు
వెల్లడించాయి.
2014లో
వేర్వేరుగా
పోటీ
చేసి
బీజేపీ
122
స్థానాలు,
శివసేన
63
సీట్లలో
గెలిచింది.
ఇప్పుడు
శివసేనకు
40కి
పైగా
సీట్లు,
బీజేపీకి
20కి
పైగా
సీట్లు
ఎక్కువ
రానున్నాయి.
సగానికి పైగా పడిపోనున్న కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు
కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను కేవలం 41 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ ఫోల్ పలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్ 17, ఎన్సీపీ 22 చోట్ల గెలుచుకుంటుందని తెలిపాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 42, 41 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా 90 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 41కి పడిపోనుంది.
హర్యానాలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ ఒంటరిగా 75 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు పరిమితం అవుతుందని News18-IPSOS సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. జేజేపీ 2 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించాయి.
ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్
ఇండియా టుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-మిత్రపక్షాల కూటమి 166-194 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ-మిత్రపక్షాల కూటమి 72-90 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. ఇతరులు 22-34 సీట్లు గెలుచుకుంటారని తేలింది.