వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తదుపరి ముఖ్యమంత్రిగా కుమారస్వామి: ఎమ్మెల్యేల హైదరాబాద్ తరలింపు మలుపుతిప్పింది
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రి కానున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన సీఎం కానున్నారు. గవర్నర్ ఆయనను ఆహ్వానించి బలం నిరూపించుకునేందుకు సమయం ఇవ్వనున్నారు.
కాగా, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంలో గులాం నబీ ఆజాద్, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించడంతో బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీపై చాలా రోజుల తర్వాత గెలిచారని అంటున్నారు.
యడ్యూరప్ప రాజీనామాను ఆమోదించిన అనంతరం కుమారస్వామిని గవర్నర్ వాజుబాయి వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. కాగా బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
bhopaiah karnataka assembly floor test live yeddyurappa yedyurappa siddaramaiah hd kumara swamy karnataka assembly elections 2018 elections results karnataka bjp supreme court congress jds కర్ణాటక అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ లైవ్ యడ్యూరప్ప సిద్ధరామయ్య కుమారస్వామి కర్ణాటక ఎన్నికల ఫలితాలు
English summary
Next is Kumarasamy will be invited by governor to form the govt and prove majority in a stipulated time.
Story first published: Saturday, May 19, 2018, 16:43 [IST]