నరేంద్ర మోడీని చంపేస్తాం: ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్కు సంబంధించిన వివరాలపై ఎన్ఏఐ హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిందని సమాచారం. జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.
ఓ మెయిల్ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్ఐఏ.. వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్టు 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) దృష్టికి తీసుకెళ్లింది.
కాగా, మెయిల్ వివరాలు ఇలా ఉన్నాయి.
From: [email protected]
Sent on: Saturday, 8 August 2020
Time: 1:34:06 am
Instruction: Kill Narendra Modi
బెదిరింపు మెయిల్పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలీజెన్స్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్ఐఏ రంగంలోకి దించింది. ఈ మెయిల్ ఎవరు పంపారు? ఎక్కడ్నుంచి వచ్చారనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.