ఎన్ఐఏ కోర్టులో ప్రగ్యా ఠాకూర్కు ఊరట
ముంబై : భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు రిలీఫ్ దొరికింది. ఆమె నామినేషన్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్ను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ప్రగ్యా ఠాకూర్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2008 మాలేగావ్ పేలుళ్లతో కొడుకును కోల్పోయిన వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది.
ప్రగ్యా సింగ్ ర్యాలీలో నల్లజెండాల రచ్చ..! ఎన్సీపీ కార్యకర్తపై బీజేపీ శ్రేణుల దాడి (వీడియో)
మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా ఠాకూర్ను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెప్పే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నిక్లలో పోటీ చేయకుండా నియంత్రించే అధికారం తమకులేదని, దీనిపై ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది.
ప్రగ్యా ఠాకూర్కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజారూ చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించిన న్యాయస్థానం.. పిటీషనర్ సరైన వేదికను ఆశ్రయించలేదని స్పష్టం చేసింది.