బాంబు పేలుడు కేసు: రంగంలోకి దిగిన ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారుల చేతికి వెళ్లింది. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని చర్చిస్ట్రీట్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
2014 డిసెంబర్ 28వ తేదిన రాత్రి 8.15 గంటల సమయంలో చర్చిస్ట్రీట్ లోని కోకోనెట్ గ్రేవ్ రెస్టారెంట్ దగ్గర జరిగిన బాంబు పేలుడులో చెన్నయ్ కి చెందిన భవాని (37) అనే మహిళ మరణించింది. ముగ్గురుకి తీవ్రగాయాలు అయ్యాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు పలు రాష్ట్రాలలో దర్యాప్తు చేసినా ఫలితం లేకపోయింది. కేంద్రప్రభత్వం జోక్యం చేసుకుని కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అడిగింది. ఈ కేసు విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా స్పందించారు.
ఆయనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఉత్తరం వ్రాసి ఫోన్ చేసి మాట్లాడు. కేసు ఎన్ఐఏ అధికారుల చేతికి వెళ్లింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు చర్చిస్ట్రీట్ బాంబు పేలుడుకు, చెన్నయ్ రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు పేలుడుకు పోలీకలు ఉన్నాయని అంటున్నారు.
బెంగళూరు నగర పోలీసులు, బెంగళూరు సీసీబీ పోలీసులు, ప్రత్యేక టీం పోలీసులు దర్యాప్తు చేసిన నివేదికలను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. బెంగళూరు పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధం లేకుండ ఎన్ఐఏ అదికారులు మళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.