వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిఫా ఎఫెక్ట్: కేరళ పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం
Recommended Video
నిఫా
ఎఫెక్ట్
తో
కేరళకు
షాకిచ్చిన
యూఏఈ
దుబాయ్/న్యూఢిల్లీ: 'నిఫా' వైరస్ కారణంగా కేరళ నుంచి తాజా కూరగాయలు, పండ్ల దిగుమతిని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్(యుఏఈ) మంగళవారం నిషేధించింది. యుఏఈ పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
ఇదే విషయాన్ని అబూదాబీ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థతో పాటూ దుబాయ్, షార్జా, అజ్మన్, రస్అల్ ఖైమా, ఫ్యుజయిరా పురపాలక సంఘాలకు ఈ మేరకు ఒక సర్క్యులర్ను పంపింది.
కేరళలో 'నిఫా' వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిఫా వైరస్ కారణంగా కేరళలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
Comments
English summary
To safeguard the health of residents, the UAE has banned imports of fresh fruits and vegetables from Kerala, India, as well as live animals from South Africa, said officials on Tuesday.
Story first published: Wednesday, May 30, 2018, 10:25 [IST]