డైనమెట్లతో కూల్చివేసిన నీరవ్ మోదీ ఇళ్లు రూపన్యా
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన సుమారు 100 కోట్ల విలువ చేసే ఇంటిని డైనమెట్లతో శుక్రవారం పేల్చివేశారు అధికారులు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి అప్పులు చేసిన నీరవ్ మోది ఇళ్లు అధికారలు కూల్చి వేశారు..ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిహిమ్ బీచ్ ఒడ్డున విలావంతమైన రూపాన్య అనే పేరుతో విలాసవంతమైన ఇల్లు కట్టారు..కాగా ఇది 33000 చదరపు అడుగుల్లో,.పటిష్టమైన సెక్యూరిటి గేట్ ,స్విమ్మింగ్ పూల్, పాటు గ్రౌండ్ ప్లస్ వన్ ప్లోర్ ను నిర్మించారు.కాగా దీని విలువ 100 కోట్లరుపాయలు ఉంటుందని అంచనా..
నీరవ్ మోడీ బంగ్లాను కూల్చేందుకు ఎన్ని డైనమైట్లు వాడుతున్నారో తెలుసా..?
అయితే ఆయన కట్టిన ఇళ్లు కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ నిబంధనలకు ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేవు, మరోవైపు 2009లో పర్యవరణానికి హనీ చేకూర్చే కట్టడాలపై ముంబయి హైకోర్టులో ఒకరు పిల్ వేశారు..దీంతో ముంబయి హైకోర్టు పర్యావరణానికి హనీ చేకూర్చే సముద్రపు అంచున ఉన్న కట్టడాలను కూల్చివేయాలని ,ఆదేశించింది..
దీంతో నీరవ్ మోది ఇళ్లును అధికారులు కూల్చే పనులు గత కొంత కాలంగా మొదలు పెట్టారు..అయితే ఇళ్లు చాల పటిష్టంగా ఉండడంతో దాన్ని కూల్చి వేయడం కష్టమవుతుంది.ఈ నేపథ్యంలోనే అధికారులు డైనమెట్లతో పేల్చి వేయాలని నిర్ణయించారు..డైనమెట్ల కు సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతుండగా ..కాగా ఈ రోజు ఆ ఇల్లును పేల్చి వేశారు.