వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిర్భయ కేసులో దోషిపై దాడి: భద్రతకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఓ దోషిపై తోటి ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటన తీహార్ జైలులో గురువారం చోటుచేసుకుంది.
దోషి వినయ్ శర్మను భద్రత నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయని తెలిసింది. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు తీహార్ జైలులో పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.
ఉరిశిక్ష తీర్పు రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈ దాడి జరగబడం గమనార్హం.
2012లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక త్యాచారం చేయడంతోపాటు తీవ్రంగా గాయపర్చి ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
Comments
English summary
One of the convicts in the brutal 16 December Delhi gang-rape case, Vinay Sharma, has filed an application in Patiala House Court, demanding security for himself in Tihar Jail.