దేశంలోనే టాప్ బెంగుళూరు ఐఐఎస్సీ: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్స్ ఎంపికైంది. దేశంలో అత్యంత గొప్ప కాలేజీగా ఢిల్లీలోని మిరండా హౌజ్ నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం నాడు విడుదల చేశారు.
విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, కళాశాలలు, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అత్యుత్తమ కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు.
బోధన, సదుపాయాలు, ప్రాక్టికల్స్, రీసెర్చ్, గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధులతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ను రూపొందించినట్టు మంత్రి ప్రకటించారు.
విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, కళాశాలలు, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు.
అత్యుత్తమ విశ్వవిద్యాలయం విభాగంలో బెంగళూరు ఐఐఎస్సీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే నిలిచాయి. ఉత్తమ వైద్య కళాశాలగా ఎయిమ్స్ నిలవగా.. ఎన్ఎస్ఎస్ఐయూ బెస్ట్ న్యాయకళాశాలగా ఎంపికైంది.