ఎఫ్ 16 శకలం మా భూబాగంలో ఎందుకు పడింది : నిర్మలా సీతారామన్
ఫారిన్ పాలసీ మ్యాగజైన్ మరోసారి పరిశీలించాలి ,నిర్మాలా సీతారామన్ పాకిస్తాన్ కు చెందిన ఏఫ్ 16 విమానాలపై అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ కథనంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు.ఈ కథనంలో పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలను అమేరికా ఢిఫెన్స్ అధికారులు లెక్కించారని ,అవి అన్ని సరిగ్గానే ఉన్నాయని ఆ ప్రతిక కథనాన్ని తప్పుబట్టారు. ఈనేపథ్యంలోనే దానిపై నిజానిజాలను సదరు పత్రిక పరీశించాలని సూచించారు.
ఎఫ్ 16 పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్
పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడకపోతే శకలం భారత భూభాగంలో ఎలా దొరికిందని ఆమే ప్రశ్నించారు.కాగా ఎఫ్ 16 పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది. మరోవైపు దీన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాధిపతుల సంయుక్త సమావేశంలో భారత్ లో దొరికిన శకలాలు చూపించారని చెప్పారు. కాగా మిగ్ 21 పైలట్ ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కుప్పకూల్చారని తెలిపింది. కాగా దీనిపై కథణాన్ని వెలువరించిన ఫారిన్ పాలసీ రిపోర్ట్ లోని నిజానిజాల్ని పరిశీలించాలని కోరారు.
పాక్ లో ఎఫ్ 16 యుద్ద విమానాలు క్షేమం ; ఫారిన్ పాలసీ రిపోర్ట్
పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ లో పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ _16 ను కూల్చబడలేదంటూ అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ మ్యాగజైన్ తన కథనంలో పేర్కోంది. ఇందుకోసం ఆమేరికా ఢిఫెన్స్ లో పనిచేసే ఓ ఇద్దరు అధికారులను పేర్కోంటూ , ఆ మ్యాగజైన్ కథనాన్ని వెలువరించింది. కాగా భారత వైమానిక అధికారులు చెప్పిన స్టేట్ మెంట్ కు విరుద్దంగా తన కథనంలో పేర్కోంది.. బాలకోట్ దాడి మరుసటి రోజు పాకిస్తాన్ కు పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ 16 ను కూల్చివేశాడని భారత వైమానిక అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి క్షిపణి భాగాలను సైతం మీడియా ముందు కూడ ప్రదర్శించారు.
నేరుగా వెళ్లి పరీశీంచామని తేల్చిన యూఎస్ అధికారులు
ఈనేపథ్యంలో బాలాకోట్ సంఘటన జరిగిన తర్వాత పాక్ లో ఎలాంటీ నష్టం జరగలేదని , తమ విమానాలు ఏవి కూల్చబడలేదని ప్రకటించింది, ఈనేపథ్యంలోనే ఆమేరికాను సైతం ఎఫ్ 16 పరిశీలించేందుకు రావాలని ఆహ్వనించిందని తెలిపింది. దీంతో ఇదే విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు యూఎస్ ఢిఫెన్స్ అధికారులు వెలువరించారని పేర్కోంది.
జెట్ ఫైటర్ లను అందించిన అమేరికా కంపనీ
కాగా పాకిస్తాన్ కు ఎఫ్ 16 జెట్ విమానాలను అమేరికాకు చెందిన లాక్హీడ్ మార్టీన్ అనే సంస్థ పంపిణి చేసింది.దీంతొ వాటిని లెక్కించేందుకు వెళ్లిన అధికారులు పాకిస్తాన్ తాము సప్లై చేసిన క్షిపణుల్లో ఏవి మిస్ కాలేదని పేర్కోన్నారని తెలిపింది.