కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...
భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మారిన విషయం తెలిసిందే.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు గాను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ పార్లమెంట్ చేరుకునే సమయంలోనే ప్రసంగాన్ని వీక్షించేందుకు తల్లిదండ్రులు సావిత్రి, నారాయన్ సీతారామన్ ప్రత్యేక కారులో పార్లమెంట్కు చేరుకున్నారు. కాగా ఆమే తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ బడ్జెట్లకు భిన్నంగా బడ్జెట్ ప్రతులను తీసుకువచ్చిన ఆమే తన టీంతో కలసి సభలోకి ప్రవేశించింది. మంత్రితోపాటు సహయా మంంత్రి అనురాగ్ ఠాకుర్తో పాటు,చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. అధికారులు ఆమే వెంట ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆమే ప్రవేశపెట్టబోయో బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ తల్లిదండ్రులు కూడ హజరయ్యారు.