నిర్మలా సీతారామన్ తప్పుగా మాట్లాడింది ; కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణం క్యాబ్లే కారణమంటూ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సితారామన్ చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు మరో కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆటోరంగంలో అమ్మకాలు తగ్గడానికి గల కారణాలను ఆమే తప్పుగా పేర్కోన్నారని ఆయన చెప్పారు. వాహన విక్రయాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు.బిఎస్ 6 కంప్లైంట్ హోండా యాక్టివా 125 స్కూటర్ లాంచ్ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ రోజు ముందు మాట్లాడారు.
దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ్లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్లే కారణమని .. యువత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కారు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొవడం కన్నా .. క్యాబ్ బుక్ చేసుకోవడమే మేలని యువత భావిస్తున్నారని ఆమే తెలిపారు. అయితే కేంద్రమంత్రి చేసిన కామెంట్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక సోషల్ మీడీయాలో అయితే నెటిజన్లు వింత వింత కామెట్లు పెట్టారు.
తాజాగా ఆమే చేసిన వ్యాఖ్యలు బాద్యతరహితంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పాడు. ఈనేపథ్యంలోనే విక్రయాల తగ్గింపుకు సంబంధించి చాల కారణాలు ఉన్నాయని అన్నారు.వాటిలో ఓలా, ఉబర్ అనేవి కూడ ఉన్నాయని చెప్పారు. ఇందులో బాగంగానే ఇ-రిక్షాలకు మారడం ఐసిఇ ఆటో రిక్షాల అమ్మకాలు మందగించాయని అన్నారు.ఇక ఆటోరంగానికి ప్రోత్సహాకాలు అందించడంతో బాగంగా జీఎస్టీ రేటును తగ్గించాలనే డిమాండ్ ఉందని దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో చర్చ చేస్తామని చెప్పారు.