పార్లమెంట్ భేటీకి ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ఎప్పుడంటే?: పేపర్ లెస్..నిర్మలమ్మ స్పెషాలిటీస్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం కుదిరింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొత్తాన్నీ కరోనా వైరస్ స్తంభింపజేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపై అందరి దృష్టీ నిలిచింది. ఈ సారి బడ్జెట్లో కరోనా వైరస్ సెస్ లేదా సర్ఛార్జ్ను విధించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. అదనపు వడ్డింపులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయం చర్చనీయాంశమౌతోంది.
29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
పార్లమెంట్
బడ్జెట్
సమావేశాలు
ఈ
నెల
29వ
తేదీన
ప్రారంభం
కాబోతోన్నాయి.
రెండు
దశల్లో
కేంద్ర
ప్రభుత్వం
ఈ
భేటీని
నిర్వహించనుంది.
తొలి
విడతగా
29వ
తేదీ
నుంచి
వచ్చేనెల
15వ
తేదీ
వరకు
పార్లమెంట్ను
సమావేశపరుస్తారు.
రెండో
దశలో
మార్చి
8
నుంచి
నెలరోజుల
పాటు
అంటే
ఏప్రిల్
8వ
తేదీ
వరకు
ఈ
భేటీ
కొనసాగుతుంది.
తొలి
విడతలో
35
సార్లు,
మలి
దశలో
24
సార్లు
పార్లమెంట్
సమావేశమౌతుంది.
17వ
లోక్సభ
అయిదో
సెషన్
ఇది.
29న
ఉదయం
11
గంటలకు
ఉభయ
సభలను
ఉద్దేశించి
రాష్ట్రపతి
రామ్నాథ్
కోవింద్
ప్రసంగిస్తారు.
ఫిబ్రవరి 1న
ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. ఈ సారి కొన్ని ప్రత్యేకతలు బడ్జెట్ సమావేశాల్లో కనిపించబోతోన్నాయి. పేపర్ లెస్ బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టబోతోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాగితం రహితంగా బడ్జెట్ ప్రతిపాదనలు సభ్యుల చేతికి అందబోతోన్నాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మాత్రమే బడ్జెట్ గురించి ఆమె వివరిస్తారు.
నో ప్రింటింగ్..
1947 నవంబర్ 26 తరువాత కాపీలు లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టబోతోండటం ఇదే తొలిసారి. నిజానికి- బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు, అధికారులు అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం, హల్వా వండటం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వల్ల ఈ సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. హల్వా వంటకం ఉండకపోవచ్చని తెలుస్తోంది. డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతులను లోక్సభ, రాజ్యసభ సభ్యులకు అందజేస్తారు.
సెస్ లేదా సర్ఛార్జ్ ఖాయమేనా?
కరోనా వైరస్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వచ్చే బడ్జెట్లో కరోనా సెస్ లేదా సర్ఛార్జ్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కొన్ని వరుస భేటీలను కూడా నిర్వహించినట్లు సమాచారం. సెస్ రూపం ఎలా ఉండాలి? ఎంత శాతాన్ని అమల్లోకి తీసుకుని రావాలి? ఏఏ వర్గాలకు చెందిన ప్రజలకు దీన్ని వడ్డించాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.