అమ్మాయిలను రేప్ చేసి హత్య చేసి మాంసం తిన్నారు: సైకో కిల్లర్స్ కు ఉరి శిక్ష వేసిన సీబీఐ !
బాలికలను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్స్ మోనిందర్ సింగ్ పెండర్, సురేంద్ర కోలికి సీబీఐ ప్రత్యేక రోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటి వరకు వీరి మీద 16 కేసులు నమ
న్యూఢిల్లీ: బాలికలను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్స్ మోనిందర్ సింగ్ పెండర్, సురేంద్ర కోలికి సీబీఐ ప్రత్యేక రోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటి వరకు వీరి మీద 16 కేసులు నమోదు అయ్యాయి.
పింకి సర్కార్ (20) అనే యువతి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని నమోదు అయిన కేసులో సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు సైకో కిల్లర్స్ మోనిందర్ సింగ్, సురేంద్ర కోలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
నిందితులు చిన్నారులను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని ఇప్పటి వరకు వీరిద్దరి మీద 16 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 8 కేసుల్లో నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రముఖ నిందితుడు సురేంద్ర కోలికి అన్ని కేసుల్లో సంబంధం ఉంది.
నిందితులు బాలికలను టార్గెట్ చేసుకుని వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తున్నారని, తరువాత సైకో కిల్లర్స్ లాగా బాలికల శరీరాలను ముక్కలు చేసి వారి సున్నితమైన అవయవాలు తింటున్నారని, చాల క్రూరంగా ప్రవర్తించారని మోనిందర్ సింగ్, సురేంద్ర కోలి మీద పోలీసులు కోర్టులో బలమైన సాక్షాలు సమర్పించారు.